ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు భారత బ్యాంకులకు వందల కోట్లను ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చింది. బెంగళూరులో ఉన్న మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫెరా చట్టం కింద దాఖలైన కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జూలై 10లోగా మాల్యా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. మరికొంత గడువు కావాలని న్యాయవాది కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. విచారణ సందర్భంగా మల్యాకు మొత్తం 159 ఆస్తులు ఉన్నాయని బెంగళూరు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.