డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ముందస్తు బెయిల్ కోసం అశోక్ ఈరోజు మరోమారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్టు అప్పగించాలని, వారంలో ఓ రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది. గతంలో ఆధార్, ఇతర డేటా చోరీ వ్యవహారంలో అశోక్ పై డేటా చోరీ కేసు నమోదైంది. ఈ కేసు విషయమై అనేక సార్లు అశోక్ కు నోటీసులు జారీ అయ్యాయి.
‘నమో’ యుగం అంతమవబోతోంది: మాయావతి