telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళికి కొత్త నిబంధన .. ఆ కోర్స్ పాస్ అయితేనే అర్హత..

course should pass before marriage is a rule

సాధారణంగా పెళ్ళికి అమ్మాయి-అబ్బాయి వయసు మొదలుకొని పెద్దల అంగీకారం వరకు కొన్ని నిబంధనలు ఉండటం ఇప్పటివరకు చూశాం. కానీ పెళ్లి చేసుకోవాలంటే కోర్సు చేసి పాస్ కావాలని నిబంధన పెట్టింది ప్రభుత్వం. పరీక్ష రాసి ఉత్తీర్ణులైన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందంటూ తేల్చి చెప్పేసింది. ఇదంతా మనదేశంలో కాదులెండి, ఇండోనేషియాలో పెళ్లి చేసుకోవాలంటే ఆ ప్రభుత్వం సూచించిన కోర్సు చదివి అందులో పాసై ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టింది. అక్కడ పెళ్లి చేసుకునే వారి కోసం మూడు నెలల కోర్సును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పెళ్లి చేసుకునే ముందు అందరూ ఈ మూడు నెలల కోర్సును పూర్తిచేసి పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసి పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ జారీ చేస్తుంది. సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే పెళ్లి చేసుకోవాలనే నిబంధన పెట్టింది. ఈ మూడు నెలల కోర్సును ఉచితంగానే అందిస్తుంది ఇండోనేషియా ప్రభుత్వం.

పెళ్లి చేసుకోబోయే వారికి ఈ మూడు నెలల కోర్సులో సంతానోత్పత్తి, అనారోగ్య నివారణ, పిల్లల సంరక్షణ వంటి అంశాలపై చిట్కాలను నేర్పిస్తారు. పెళ్లంటే ఆలుమగలు కలవడమే కాదు… పిల్లలను పోషించడం, ఆరోగ్య సంరక్షణ… కుటుంబ పోసిన వంటివి చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటివి ఈ కోర్సులో నేర్పించడానికి ఇండోనేషియా ప్రభుత్వం ఈ కొత్త కోర్సును ప్రవేశపెటిందట. ఇందులో ఉత్తీర్ణత పొందిన వారికి మాత్రమే పెళ్ళి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. 2020 సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కల్చర్ విభాగం ప్రకటించండి. ఈ కోర్సులు పరీక్షలు ఏమీ లేవు నేను పెళ్లి చేసుకుంటానంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసుకున్నారే అనుకోండి వారిపై కఠిన చర్యలు తప్పవు. అంతేకాకుండా ఈ కోర్సులు పూర్తిచేసి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ మూడు నెలల కోర్సు పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. భలే నిబంధన కదూ!

Related posts