telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఊబర్‌ డ్రైవర్‌ దారుణ హత్య..

Two sons murder after father sucide
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఓ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. అనంతరం ముక్కలుగా కోసి మురికి కాలువలో పడేశారు. వివరాల్లోకి వెళితే  తూర్పు ఢిల్లీలోని శాఖార్‌పూర్‌లో నివాసముండే రామ్‌గోవింద్‌ ఊబర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుంచి ఘజియాబాద్‌కు ఫర్హాత్‌ అలీ, సీమా శర్మ  దంపతులు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. ఘజియాబాద్‌కు చేరుకోగానే గోవింద్‌ను తమ ఇంటికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం గోవింద్‌కు టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. 
మరునాడు మృతదేహాన్ని ముక్కలుగా కోసి మూడు సంచుల్లో ప్యాక్‌ చేసి నొయిడాలోని మురికి కాలువలో పడేశారు. జనవరి 29న డ్యూటీ నిమిత్తం వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో గోవింద్‌ భార్య శాఖార్‌పూర్ పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఫర్హాత్‌ దంపతులను మెహ్రౌలి-గురుగ్రామ్‌ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు.

Related posts