telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విదేశాల నుండి పారాచూట్ తో.. ముంబైకి..

couple from foreign to mumbai by parachute

విదేశాల నుండి విమానాలలో వచ్చే వారిని చూసి ఉంటాం.. కానీ పారాచూట్ లో వచ్చిన ఒక జంట ముంబై వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. గుర్తుతెలియని విదేశీ దంపతులు ఇద్దరు పారాచూట్ సాయంతో నవీముంబయిలోని ఘన్‌సోలీ ప్రాంతం సమీపంలోని బీచ్ లో దిగిన ఘటన సంచలనం రేపింది. వీరు పారాచూట్ సాయంతో దిగిన ఘటన తెలియగానే, ముంబయి పోలీసులతో పాటు యాంటీ టెర్రర్ సెల్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు.

25 ఏళ్ల విదేశీ మహిళ నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల భవనంపై పారాచూట్ సాయంతో దిగింది. అంతకు ముందే ఆమె బాయ్ ఫ్రండ్ భూమిపైన దిగి తన ప్రియురాలికి స్వాగతం చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పారాచూట్ సాయంతో కిందకు దిగుతున్న దంపతుల సీసీటీవీ ఫుటేజ్ లు లభించినా వాటిలో విదేశీయులు స్పష్టంగా కనిపించలేదు. గతంలో టెర్రరిస్టులు ముంబయి వచ్చి దాడులకు దిగిన నేపథ్యంలో గుర్తుతెలియని విదేశీయులు పారాచూట్ల సాయంతో నవీ ముంబయిలోకి రావడంతో తీరప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పారాచూట్ల సాయంతో కిందకు దిగారని స్థానిక నవీ ముంబయి వాసులు చెబుతుండగా, భద్రతా బలగాలు దర్యాప్తు చేసి, ఇది గాలివార్త అని కొట్టిపారేయడం విశేషం.

Related posts