ఏపీ శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్నినిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైసీపీ ముఖం చూపించుకోలేకనే పిరికిపంద చర్యగా లైవ్ టెలికాస్ట్ నిలిపివేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. నిలిపివేసిన లైవ్ టెలికాస్ట్ ను వెంటనే పునరుద్ధరించాలని, వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘జగన్ సిగ్గుపడాలి’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్టు చేశారు.