తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కొల్లూపూర్ చౌరస్తా సమీపంలో ఓ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గోడౌన్ మొత్తానికి వ్యాపించాయి. మంటలు ఉవెత్తున ఎగిసిపడడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే పత్తి బేళ్లు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
t
వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు