telugu navyamedia
క్రీడలు

ఐపీఎల్‌ 2020 పై బీసీసీఐ బ్రేకింగ్ న్యూస్

ipl

ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడం, లాక్ డౌన్ మరిన్ని రోజుల పాటు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత.. అప్పటి పరిస్థితులు బట్టి టోర్నీ నిర్వహణపై చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది. కాగా, మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ – 13 దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడింది. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు రెండో దశ లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ నిరవధిక వాయిదా వల్ల బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, వాణిజ్య ప్రసార హక్కుదారులు అందరూ కూడా భారీ నష్టాలు చవి చూడాల్సిందే.

Related posts