telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్రియుడిని హంతకుడిగా మార్చిన కరోనా..!

itsly

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, యూరప్, అమెరికా వంటి దేశాల్లో పంజా విసురుతోంది. అందులోనూ కరోనా వైరస్‌ కారణంగా ఇటలీ అతలాకుతలంగా ఉంది. అయితే తనకు కరోనా అంటిందని అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లారెనా డాక్టర్ కాగా.. ఆంటోనియా మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఆ తర్వాత స్వల్పంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా గా భావించిన అతను లారెన్ పై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ద్వారానే తనకు కరోనా సోకిందని భావించి.. బుధవారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా లారెన్, ఆంటోనియాల్లో ఎవరికీ కరోనా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

Related posts