ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు చేపట్టాయి. అయినపట్టికీ కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస బాధ్యతను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఈ నెల 16న అమెరికాలోని డల్లాస్ నుంచి ఒక యువకుడు విజయవాడకు వచ్చాడు.
అమెరికా నుంచి వచ్చిన ఉవాకున్ని పరీక్షించిన వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తూ… చేతికి ట్యాగ్ వేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోని అతగాడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మచిలీపట్నం, పెదపారుపూడి మండలం భూషణగుల్లలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..