తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 45 మంది ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారేనని తెలిసింది. ఇటీవల ఓ స్టోర్ యజమాని బర్త్ డే వేడుకలు నిర్వహించడమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.
సదరు దుకాణదారు సరూర్ నగర్ నివాసి. మలక్ పేట్ గంజ్ లో ఆయనకు ఓ దుకాణం ఉంది. అయితే తన మిత్రుడి కోసం జన్మదిన వేడుకలు నిర్వహించాడు. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు.
బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్రెడ్డి