telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Corona

ఏపీలో కరోనా విజృంభించడంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 10,093 కేసులు నమోదు కాగా, ఆ రికార్డు ఇవాళ తెరమరుగైంది. కొత్తగా 10,167 మందికి కరోనా నిర్ధారణ అయింది. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఊపందుకొన్నాయి. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు గుర్తించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ఏపీలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 68 మంది చనిపోయారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 1,281కి పెరిగింది. తాజాగా, 4,618 మంది డిశ్చార్జి అయ్యారు. , 69,252 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Related posts