ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అదే సమయంలో 91 మంది వైరస్ భారీనపడి మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,092కి పెరిగింది. చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.