telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్ మరోసారి విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ

modi on jammu and kashmir rule

ప్రజలు సహకరిస్తే భారత్ మరోసారి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది” అని ఈ ఉదయం మోదీ పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. తన ట్వీట్ తో పాటు ఆయన, ఓ మ్యూజిక్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు.

‘ముస్కురాయేగా ఇండియా’ పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వీక్షించారు.

Related posts