telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించాల్సిందే: కేంద్రం

rjasthan corona

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పకుండా పాటించేలా చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిందని పేర్కొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కాగా, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పలు రాష్ట్రాల్లో రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు ఆడుకుంటున్నారు. గుంపులు గుంపులుగా ఉందద్దని వెనక్కి పంపిస్తున్నారు.

Related posts