telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం..కొత్తగా 1,897 కేసులు నమోదు

Corona

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో నిన్న 22,972 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,897 కేసులు వెలుగు చూశాయి. ఇంకా 1221 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కు పెరిగింది. అలాగే, నిన్న 9 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 654కు పెరిగింది. మహమ్మారి కోరల నుంచి నిన్న 1,920 మంది బయటపడ్డారు. దీంతో కొవిడ్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 61,294కు చేరుకోగా, ఇంకా 22,596 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో 479 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగు చూడగా, రంగారెడ్డి జిల్లాలో 162, సంగారెడ్డిలో 107, వరంగల్‌‌లో 87, పెద్దపల్లిలో 62 కేసులు నమోదైనాయి.

Related posts