telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది: మంత్రి ఎర్రబెల్లి

erraballi dayaaker

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు అన్నారు. తననియోజక వర్గం పాలకుర్తిలోని కరోనా బాధితులకు భరోసా కల్పించారు. కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాబాధితులకు మనో ధైర్యం ఇవ్వడం కోసమే నేరుగా టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కరనో తీవ్రత కొంత తగ్గిందన్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనా ఏమీ చేయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఎంపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, డాక్టర్లు పాల్గొన్నారు.

Related posts