telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 62మంది మృతి

corona vairus

ఏపీలో కరోనా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ మరణాల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనూ రికార్డు స్థాయిలో 62 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నం జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 758కి చేరింది.

గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ పరీక్షించగా, 4,944 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇవాళ 1,232 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 32,336 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts