telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ .. కొత్తగా 2,751 కేసులు నమోదు

corona vairus

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,751 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1675 మంది కోలుకున్నారని తెలిపింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,116 కి చేరింది. ఆసుపత్రుల్లో 30,008 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 89,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 808కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 432 మండి కోవిడ్ భారిన పడ్డారు

Related posts