telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 1982 మందికి పాజిటివ్‌

Corona

తెలంగాణలో కొవిడ్‌-19 విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1669 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 627కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 కేసులు నమోదయ్యాయి.
.

Related posts