telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,734 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,734 కేసులు నమోదయ్యాయని తెలిపింది. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,325 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 95,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 836కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 347 మండి కరోనా భారీనపడ్డారు.

Related posts