telugu navyamedia
వార్తలు సామాజిక

భారత్‌లో విస్తరిస్తున్న కరోనా.. కొత్తగా 6,654 కేసులు

Corona

దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా సోకింది.

ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,25,101కి చేరింది. 69,597 మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Related posts