దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. . గత 24 గంటల్లో దేశంలో 93,337 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరింది. గత 24 గంటల సమయంలో 1,247 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 85,619కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది కోలుకున్నారు. 10,13,964 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుడ్తున్నారు. నిన్నటి వరకు మొత్తం 6,24,54,254 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రతి రోజూ బాధను అనుభవిస్తూ పాలన: కుమారస్వామి