telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా విలయతాండవం..కొత్తగా 78,357 మందికి పాజిటివ్

corona covid

దేశంలోకరోనా విలయతాండవం చేయడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 78,357 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 1,045 మంది మృతి చెందారని పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,69,524కు చేరింది.

దేశంలో మృతుల సంఖ్య మొత్తం 66,333 కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 29,019,09 మంది కోలుకున్నారు. 8,01,282 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 4,43,37,201 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

Related posts