దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 76,472 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. అదే సమయంలో 1,021 మంది మృతి చెందారని వెల్లడించింది.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 34,63,973కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 62,550కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. 7,52,424 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 76.47 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,47,995కి చేరింది.
పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్