ఏపీలో కరోనా కన్నెర్ర చేయడంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 93 మంది బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతుండడంపట్ల ఆందోళన నెలకొంది.
ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,296కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కాగా, ఇంకా 90,425 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 6,676 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ చురకలు