telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొత్తగా 2,207 కోవిడ్ కేసులు

corona vairus

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 75,257కి చేరాయి.

వైరస్‌ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది బాధితులు ఆసుపతరుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,66,984 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 14,837 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.

Related posts