ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,727 శాంపిళ్లను పరీక్షించగా 73 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,332గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 287 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.
వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,014 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 1, గుంటూరులో 29, కడపలో 4, కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.