telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 7,738 మందికి పాజిటివ్

corona vairus

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విలయం సృష్టిస్తున్న ఈ మహమ్మారి ఉదృతంగా మారుతోంది.

తాజాగా ఏపీలో 7,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 57 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514కి చేరాయి. మరణాల సంఖ్య 5,359కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,836 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts