telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కర్నూలు జిల్లాను వణికిస్తున్న కరోనా!

karona virus

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకే రోజు కర్నూలు జిల్లాలో అధికంగా కేసులు నమోదు కావడం పై జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం.

 కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 53కి పెరిగింది. దీంతో కర్నూలు జిల్లా వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 34 కేసులతో నెల్లూరు, 30 కేసులతో గుంటూరు జిల్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Related posts