telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ …కొత్తగా 1,831 మందికి కరోనా

Corona

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. అటు, ఒక్క రోజులో 11 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 306కి పెరిగింది.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే నేడు డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు నమోదైనాయి.

Related posts