భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్కు పాజిటివ్ అని తెలిసిన గంటల వ్యవధిలోనే తనకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చినట్లు టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు. ‘తేలిక లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతకుముందే నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలి’అని యూసఫ్ విజ్ఞప్తి చేశాడు. ఇక ఇటీవలే ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ తరఫున యూసఫ్ పఠాన్ బరిలోకి దిగాడు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఇండియా లెజెండ్స్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఆడిన సచిన్, యూసఫ్ ఇద్దరూ కరోనా బారిన పడటంతో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన క్రికెటర్లలో కంగారు మొదలైంది. వారంతా టెస్ట్లు చేసుకునేందుకు రెడీ అయ్యారు.
previous post