కరోనా వైరస్ విస్తరించకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మనాత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో మంత్రి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కరోనా వైరస్ లేదని.. విదేశాల నుంచి భారత్కు వస్తున్న వాళ్ల ద్వారా ఈ వైరస్ మనదేశంతో పాటు రాష్ట్రంలోకి ప్రవేశించిందని తెలిపారు. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
వైరస్ సోకిన వారితో పాటు వ్యాధి సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. మనం శుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్లు మిగతా వాళ్లకు దూరంగా ఉండాలి. ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.