telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవు: బండి సంజయ్

BJP Bandi sanjay

తెలంగాణలో ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారంఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు.

రోనా నుంచి ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర పథకాలనే తెలంగాణ ప్రభుత్వం తమ‌ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందన్నారు. మోదీ ఏడాది పాలనను అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. దేశ జీడీపీని పెంచిన ఘనత ప్రధాని మోదీదే అని ఆయన పేర్కొన్నారు.

Related posts