telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గ్రాండ్ గా వివాహ వేడుక..పాల్గొన్న 16 మందికి కరోనా

marriage

కరోనా వైరస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా వ్యాపిస్తుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో 10 మందితో క‌లిసినా అనుమానమే. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఒకేరోజు 16 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. గత వారం క్రితం ధర్మపురికి చెందిన అమ్మాయికి, మంచిర్యాలకు చెందిన అబ్బాయితో ధర్మపురిలో గ్రాండ్ గా పెద్ద‌లు వివాహం జ‌రిపించారు.

పెళ్ళికి అనుమతి తీసుకున్నప్పటికీ పరిమితికి మించి జనం హాజరయ్యారు. ఈ శుభ‌కార్యంలో పాల్గొన్నవారు దగ్గు, జలుబు, జ్వరంతో బాధ‌పడుతుండగా ఇవాళ‌ కరోనా పరీక్షలు నిర్వ‌హించారు. ఈ పరీక్షల్లో వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న 16 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఇక‌, వివాహానికి వ‌చ్చిన‌వారిపై ఆరా తీస్తున్నారు.

Related posts