telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా

exam hall

క‌రోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో అన్ని ర‌కాల‌ ప‌రీక్ష‌లు వాయిదాప‌డ్డాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగిస్తున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.

Related posts