telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం: విజయశాంతి

vijayashanthi fires data missing issue

మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, అవే ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ స్టార్‌క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరులో విజయశాంతి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికలు రాహుల్‌గాంధీకి, నియంతృత్వ మోదీకి మధ్య జరగనున్నాయని అన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కానీ, ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు.

Related posts