మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, అవే ఫలితాలు లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని కాంగ్రెస్ స్టార్క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరులో విజయశాంతి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికలు రాహుల్గాంధీకి, నియంతృత్వ మోదీకి మధ్య జరగనున్నాయని అన్నారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కానీ, ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు.
జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్, లెక్కల్లోనూ వీకే: లోకేశ్