తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపించారని మండిపడ్డారు. స్కీముల పేరుతో స్కాములు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవే జాతీయ పార్టీల చేతులో ఎందుకు 7 సీట్లలో ఓడిపోయింది? అని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్ కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో? స్కీములు అమలుచేసే పేరుతో ఎన్ని కోట్ల స్కాంలకు పాల్పడతారో? అనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదని తెలిపారు.కేసీఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతైపోయే ప్రమాదం ఉందని విజయశాంతి అన్నారు.
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు: విజయసాయిరెడ్డి