telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్‌

uttam congress mp

కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి కూడా టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకించాయని, మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయట్లేదని ప్రశ్నించారు. మునిసపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన కోరారు. తెలంగాణలో ఎస్సీలు అతిపెద్ద సామాజిక వర్గమని, ఒక్క ఎస్సీకి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని ఉత్తమ్ దుయ్యబట్టారు.

Related posts