telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు!

shivasena congress

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన వేగంగా పావులు కదుపుతోంది. శివ సేనతో చేతులు కలిపే విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అంత సుముఖంగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్ మద్దతు పొందడంలో ఆ పార్టీ విజయం సాధించింది.ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శివసేనకు మద్దతు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఈ రోజు సాయంత్రం 7గంటలలోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్ఫష్టం చేయాలని శివసేనను కోరారు. ఈ నేపథ్యంలో శివసేన అదినేత ఉద్దవ్ థాకరే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించారు. బయట నుంచి మద్దతుకు  చెబుతున్నట్లు సోనియా ప్రకటించారు.

Related posts