telugu navyamedia
రాజకీయ వార్తలు

సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయం: సోనియా

Soniya gandhi

గత పది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. సంక్షోభ సమయంలో ధరల పెంపు తప్పుడు నిర్ణయమని అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు.

దేశంలో కరోనా వల్ల తలెత్తిన సంక్షోభంతో బాధపడుతోన్న ప్రజలపై మరింత భారం వేసేలా పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతున్నారని ఆమె అన్నారు. ఈ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. బాధల్లో ఉన్న ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టకూడదని సోనియా గాంధీ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రజలపై అధిక ధరల భారం మోపి లాభం పొందాలని చూడడం సహేతుకం కాదని చెప్పారు.

Related posts