సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో నిన్న ఢిల్లీలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో రతన్ లాల్ అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఘాటుగా స్పందించారు.
మతం పేరుతో ప్రజలను విడదీసే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. మహాత్ముడు జన్మించిన దేశంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సంఘటనలు బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాల్సిన తరుణమని పేర్కొన్నారు.