telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధూకు లైన్ క్లియర్

EC Issues notices to Minister siddu

పంజాబ్ కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ సిద్ధూ పాకిస్థాన్ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆయనకు భారత విదేశాంగ శాఖ అనుమతులు జారీ చేసింది. పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు.

అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన తిరిగి మూడో లేఖ రాశారు. తన మూడో లేఖకు కూడా స్పందించకపోతే లక్షలాది మంది సిక్కు భక్తుల మాదిరే తాను పాకిస్థాన్ వెళతానని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది.

Related posts