తెలగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ తీరు సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం జరిగేదా? అని ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడు ఓ మాట.. తీరాక మరో మాట మాట్లాడే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
కార్మికులను డిస్మిస్ చేస్తామంటే ప్రజలు కేసీఆర్ను డిస్మిస్ చేస్తారని స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల నుంచి తొమ్మిదింటిని తీసేయడానికి కేసీఆరే కారణమన్నారు. రిజర్వేషన్ల విషయంలో ముస్లింలు, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారన్నారు. హుజూర్నగర్లో ముస్లింలు, గిరిజనులు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని షబ్బీర్అలీ పిలుపునిచ్చారు.