telugu navyamedia
రాజకీయ

రేపు ఈడీ ముందుకు మోదీ వెళ్లాల్సి వస్తుంది: సంజయ్ సింగ్

MLA Upender Reddy Join shortly TRS
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. పెట్రోలియం డీల్ కు సంబంధించిన కేసులో ఈరోజు ఈడీ ముందు  రాబర్ట్ వాద్రా విచారణకు హాజరవుతున్నారని, రేపు ఈడీ ముందుకు మోదీ వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం బయట రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కలసి ఉన్న పోస్టర్లను అంటించారు. 
కార్యలయం బయట అంటించిన పోస్టర్లను న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) తొలగించింది. ఈ నేపథ్యంలోనే, మోదీపై సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పెళ్లి అయినప్పటికీ భార్య జశోదా బెన్ తో మోదీ కలసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రాల అనుబంధం కలకాలం ఉంటుందని చెప్పారు. ఎన్నో వివాదాల్లోకి వీరి పేర్లను లాగినప్పటికీ, వాటిని బీజేపీ నిరూపించలేక పోయిందని అన్నారు.

Related posts