telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆ పార్టీతో పొత్తు లేదు.. తేల్చేసిన కాంగ్రెస్..

congress on three states cm candidate

మహాకూటమి పేరుమీద జాతీయంగా ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు కృషిచేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక్క పార్టీ తక్క అంటున్నారు. రాబోవు ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణముల్ కాంగ్రెస్ తో పొత్తులు ఉండవని తేల్చేశారు. టీఎంసీతో ఎటువంటి పొత్తు ఉండబోదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమేంద్రనాథ్ మిత్రా తేల్చి చెప్పారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ టీఎంసీతో పొత్తుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో మమత బెనర్జీ 34 స్థానాలను గెలుచుకున్నారు. కాగా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Related posts