తెలంగాణ మున్సిపల్ మంత్రిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
గ్రేటర్ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారని ఇలా అందమైన అబద్దాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ మంత్రి గా విఫలమైన కేటీఆర్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ చెప్పింది నమ్మి ఆశతో ప్రజలు ఓట్లేశారనిఅన్నారు.
ముస్లింలు సొంతంగా రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలి: ఒవైసీ పిలుపు