లోక్సభ సమావేశాల రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. తొలి రోజు ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా రెండో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.దేశంలోనే అతి పెద్దదైన మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి తన ప్రమాణస్వీకారంలో వైవిధ్యాన్ని చూపించారు.
మిగిలిన సభ్యుల మాదిరి పేపర్ పై రాసిన ప్రతిజ్ఞను చదవకుండా మొబైల్ ఫోన్ లో చూసి తెలుగులో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, రేవంత్ ప్రమాణస్వీకారం కోసం తన సీటు నుంచి లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు టేబుళ్లను శబ్దం చేస్తూ రేవంత్ ను ఆహ్వానించారు.
యోగి అదిత్యనాథ్కు ఓటు వేకుంటే జేసీబీలు, బుల్డోజర్లుతో తొకిస్తాం..