telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు: రేవంత్‌రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. లిఫ్ట్ ప్రాజెక్టుల పేరిట కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.పోతిరెడ్డిపాడుపై వీరోచిత పోరాటం చేసినట్లు సీఎం కేసీఆర్‌ గొప్పలు చెబుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవాచేశారు. సెప్టెంబర్ 13, 2005న పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44 వేలకు పెంచుతూ ఇచ్చిన జీవోపై ఆనాడు కేసీఆర్‌ మాట్లాడలేదని గుర్తుచేశారు.

ఆగస్ట్ 20, 2006న కేసీఆర్, అలె నరేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఆనాడు వాళ్లు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడలేదని రేవంత్ గుర్తు చేశారు. సీఎం జగన్ ఇచ్చిన 203 జీవో వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో బంతి భోజనం తర్వాతే జగన్‌ జీవో ఇచ్చాడని, 885 అడుగుల పైనుంచి తీసుకెళ్తే వరద జలం అవుతుందని ప్రశ్నించారు.

Related posts