telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవు: రేణుకా చౌదరి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై  ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు  అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవని అన్నారు. నామా నాగేశ్వరరావుకు ఓట్లేస్తే ప్రజలకు నామాలు పెడతారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. 
నామా నాగేశ్వరరావుకు ఓటేస్తే ఖమ్మం ప్రజలకు నామాలు పెడతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీల దమ్ము ఏంటో కేసీఆర్ కు తెలియాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పోడు భూముల సమస్య సృష్టించి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జామాయిల్, పామాయిల్, సుబాబుల్ రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Related posts